మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
సెప్టెంబర్ 11, నల్లా సమాచార్ న్యూస్ / బచ్చన్నపేట :
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ వాసి మంగోల్ దేవదాసు మరణించడం జరిగింది. వారి కుటుంబానికి టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మల్లేష్ గౌడ్ పరామర్శించి తన వంతు గా 5000/- రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, వార్డ్ మెంబర్ మల్లయ్య గౌడ్, భాస్కర్ రెడ్డి, యూత్ అధ్యక్షులు మహేష్ చిటుకూరి రాజు బాబు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.